Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:15 AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
02-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

ఆలేరు,: అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజులు) కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హుల గుర్తింపు చేసి పథకాలు అందించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త సంక్షేమ పథకాలు కూడా అమలులోకి రానున్నాయని చెప్పారు.

సంక్షేమం పేదలకు చేరడమే లక్ష్యం: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ ఉచిత బస్సు, గృహజ్యోతి, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

100% లబ్ధిదారులకు పథకాలు చేరాలి: తీన్మార్ మల్లన్న

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు శాతం 100 లబ్ధిదారులకు చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

అవగాహన కార్యక్రమాలు కీలకం: కలెక్టర్

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో అవగాహన కార్యక్రమాలు కీలకమని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల అమలులో జిల్లా ముందుందని, మహిళల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Article Image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

ఆలేరు,: అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజులు) కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హుల గుర్తింపు చేసి పథకాలు అందించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త సంక్షేమ పథకాలు కూడా అమలులోకి రానున్నాయని చెప్పారు.

సంక్షేమం పేదలకు చేరడమే లక్ష్యం: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ ఉచిత బస్సు, గృహజ్యోతి, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

100% లబ్ధిదారులకు పథకాలు చేరాలి: తీన్మార్ మల్లన్న

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు శాతం 100 లబ్ధిదారులకు చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

అవగాహన కార్యక్రమాలు కీలకం: కలెక్టర్

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో అవగాహన కార్యక్రమాలు కీలకమని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల అమలులో జిల్లా ముందుందని, మహిళల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News