అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
K.RAVI
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, అణగారిన వర్గాల పాలిట ఆయన వెన్నంటి ఉండే దేవుడని అన్నారు."అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను నేడు మనమందరం అనుభవిస్తున్నాం. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆ ఆశయాలను ముందు తరాలకు అందించడమే మనం వారికిచ్చే అసలైన నివాళి."ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ డి. శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్స్ కొసనం రాకేష్ రెడ్డిపోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఊదరి యాదయ్య, కొయ్యాడ శేఖర్, దేప రమ్య రాజు,బత్తుల జయమ్మ దాసు, గడ్డం ఇందిర రాజరత్నం, చింతల ఉమామహేశ్వరి సాయిలు,బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్, ఆలే చిరంజీవి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి