Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:00 PM

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
April 14, 2026 03:48 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, అణగారిన వర్గాల పాలిట ఆయన వెన్నంటి ఉండే దేవుడని అన్నారు.​"అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను నేడు మనమందరం అనుభవిస్తున్నాం. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆ ఆశయాలను ముందు తరాలకు అందించడమే మనం వారికిచ్చే అసలైన నివాళి."​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ డి. శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్స్ కొసనం రాకేష్ రెడ్డి​పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఊదరి యాదయ్య, కొయ్యాడ శేఖర్, దేప రమ్య రాజు,బత్తుల జయమ్మ దాసు, గడ్డం ఇందిర రాజరత్నం, చింతల ఉమామహేశ్వరి సాయిలు,బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్, ఆలే చిరంజీవి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News