Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:03 PM

అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై హైకోర్టు తలుపుతట్టిన టీడబ్ల్యూజేఎఫ్

అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై హైకోర్టు తలుపుతట్టిన టీడబ్ల్యూజేఎఫ్

అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై హైకోర్టు తలుపుతట్టిన టీడబ్ల్యూజేఎఫ్
May 05, 2026 08:06 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

రాష్ట్రంలో మీడియా అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై వివాదం నెలకొంది. అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర, జిల్లా కమిటీల నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) హైకోర్టును ఆశ్రయించింది.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)ల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. జీవో 252 ప్రకారం కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఉండాల్సి ఉండగా, కేవలం మూడు సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చారని, తమ సంఘానికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్‌తో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.

ఇక మరో పిటిషన్‌లో, అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటుకు జారీ చేసిన జీవో ఆర్టీ 229ను రద్దు చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడు, ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు దాఖలు చేసిన పిటిషన్‌లో, జీవో 252 నిబంధనలకు విరుద్ధంగా జీవో 229 అమలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉండగా, మూడు సంఘాలకు మాత్రమే అవకాశం కల్పించడం నిబంధనల ఉల్లంఘన అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీవో ఆర్టీ 229 అమలను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు.

ఈ రెండు పిటిషన్లపై విచారణకు హైకోర్టు ఎప్పుడు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News