అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య
అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి పోయింది అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.. రై తులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతు వారోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు ఏం చేశారని వారోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. పంటవేసేటప్పుడు కావాల్సిన యూరియా ఇవ్వనందుకా.. రైతు భరోసా వాయిదాల ప్రకారం ఇస్తున్నందుకా, రైతుభిమా రద్దు చేసినందుకా.. రెండు లక్షల రుణ మాఫీ చేయనందుకా వారోత్సవాలు అని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతనుంది దృష్టి మరల్చడానికే ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తున్నారని అన్నారు మీరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య ,గోపగాని రమేష్ ,గోపగాని వెంకన్న, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి