ఐకెపికేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి; సీతయ్య
ఐకెపికేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి; సీతయ్య
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం లో ప్రారంభం చేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభం చేయాలి. ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు ప్రారంభం చేయాలనీ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రానున్నరోజుల్లో అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా ఉన్నది కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా వెంటనే మిల్లులు కేటాయించి. బస్తాలు పంపి. త్వరగా లారీలు మిల్లుల వద్ద దిగుమతి అయ్యవిధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని. తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే రవాణ అయ్యే విధంగా లారీలను పంపాలని అన్నారు. మిల్లుల వద్ద ఎలాంటి తరుగు కోతలు లేకుండా దిగుమతి చేసుకొని మూడురోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయాలని అన్నారు.
ఐకెపి కేంద్రాల్లో రైతులకు మంచినీటి సౌకర్యం.టెంట్ సౌకర్యం కల్పించే విధంగా నిర్వాకులకు ఆదేశాలివ్వాలని అన్నారు.. రైతు కొనుగోలు కేంద్రాల్లో కానీ
మిల్లుల వద్దకానీ దోపిడీకి గురికాకుండా ప్రభుత్వ అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు. గోపగాని రమేష్. గోపగాని వెంకన్న. భాస్కర్ పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి