Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:37 PM

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!
March 05, 2026 11:18 AM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

36–40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు – 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు
  2. ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి
  3. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు విరామాలు తీసుకోవాలి

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News