Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:01 PM

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!
05-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

36–40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు – 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు
  2. ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి
  3. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు విరామాలు తీసుకోవాలి

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

Sthanikam

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

Article Image

36–40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు – 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు
  2. ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి
  3. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు విరామాలు తీసుకోవాలి

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News