Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 05, 2026 12:48 PM

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!
March 05, 2026 11:18 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

36–40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు – 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు
  2. ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి
  3. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు విరామాలు తీసుకోవాలి

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News