Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:21 PM

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!
March 05, 2026 11:18 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

36–40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు – 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు
  2. ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి
  3. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు విరామాలు తీసుకోవాలి

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News