Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:14 PM

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన
April 16, 2026 12:36 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామన్నపేట గ్రామంలోని మైనార్టీ కాలనీలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్పీజీ గ్యాస్ లీకేజీ లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. గ్యాస్ వాసన వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆపడం, ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయకపోవడం, వెంటిలేషన్ కల్పించడం వంటి ముఖ్య సూచనలు తెలియజేశారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఎస్‌ఎఫ్‌ఓ బి.మధుసూదన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నరసయ్య, సిబ్బంది షఫీ, పాండు, గోపాల్, మధు పాల్గొన్నారు. కాలనీ ప్రజలు జావేద్, ఖాసిం, షాహిద్ తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News