Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:23 PM

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన
16-04-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామన్నపేట గ్రామంలోని మైనార్టీ కాలనీలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్పీజీ గ్యాస్ లీకేజీ లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. గ్యాస్ వాసన వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆపడం, ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయకపోవడం, వెంటిలేషన్ కల్పించడం వంటి ముఖ్య సూచనలు తెలియజేశారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఎస్‌ఎఫ్‌ఓ బి.మధుసూదన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నరసయ్య, సిబ్బంది షఫీ, పాండు, గోపాల్, మధు పాల్గొన్నారు. కాలనీ ప్రజలు జావేద్, ఖాసిం, షాహిద్ తదితరులు హాజరయ్యారు.

Sthanikam

అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రజల్లో అవగాహన

Article Image

రామన్నపేట: మండలంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామన్నపేట గ్రామంలోని మైనార్టీ కాలనీలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్పీజీ గ్యాస్ లీకేజీ లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. గ్యాస్ వాసన వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆపడం, ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయకపోవడం, వెంటిలేషన్ కల్పించడం వంటి ముఖ్య సూచనలు తెలియజేశారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఎస్‌ఎఫ్‌ఓ బి.మధుసూదన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నరసయ్య, సిబ్బంది షఫీ, పాండు, గోపాల్, మధు పాల్గొన్నారు. కాలనీ ప్రజలు జావేద్, ఖాసిం, షాహిద్ తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News