అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక
అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక
Editor Desk
వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం ఆరోపణలు
నకిరేకల్: నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ ఏజెంట్ల ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తూకాల్లో గందరగోళం సృష్టించి క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, అధికారులు రాజకీయ ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి