Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:27 PM

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక
16-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం ఆరోపణలు

నకిరేకల్: నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ ఏజెంట్ల ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తూకాల్లో గందరగోళం సృష్టించి క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, అధికారులు రాజకీయ ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

Article Image

వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం ఆరోపణలు

నకిరేకల్: నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ ఏజెంట్ల ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తూకాల్లో గందరగోళం సృష్టించి క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, అధికారులు రాజకీయ ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News