Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:33 AM

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు
27-04-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రోషిణి (20) అనే మహిళ ఇటుకబట్టిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

శాలిగౌరారం 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మహిళ ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ వెళ్లే వీలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను సుమారు 2 కిలోమీటర్ల దూరం స్కూప్ స్ట్రక్చర్‌పై మోసుకుంటూ అంబులెన్స్‌ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో రోషిణి సాఫల్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా గర్భిణిని ఎండలో రెండు కిలోమీటర్ల పాటు మోసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన 108 సిబ్బంది పైలెట్ సమీర్, ఈఎంటీ హేమంత్ సేవలను స్థానికులు అభినందించారు.

Sthanikam

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

Article Image

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రోషిణి (20) అనే మహిళ ఇటుకబట్టిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

శాలిగౌరారం 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మహిళ ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ వెళ్లే వీలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను సుమారు 2 కిలోమీటర్ల దూరం స్కూప్ స్ట్రక్చర్‌పై మోసుకుంటూ అంబులెన్స్‌ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో రోషిణి సాఫల్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా గర్భిణిని ఎండలో రెండు కిలోమీటర్ల పాటు మోసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన 108 సిబ్బంది పైలెట్ సమీర్, ఈఎంటీ హేమంత్ సేవలను స్థానికులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News