అంబులెన్స్లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు
అంబులెన్స్లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఓ గర్భిణి అంబులెన్స్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రోషిణి (20) అనే మహిళ ఇటుకబట్టిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
శాలిగౌరారం 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మహిళ ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ వెళ్లే వీలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను సుమారు 2 కిలోమీటర్ల దూరం స్కూప్ స్ట్రక్చర్పై మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్లో రోషిణి సాఫల్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సందర్భంగా గర్భిణిని ఎండలో రెండు కిలోమీటర్ల పాటు మోసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన 108 సిబ్బంది పైలెట్ సమీర్, ఈఎంటీ హేమంత్ సేవలను స్థానికులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి