Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:52 PM

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు
April 27, 2026 06:26 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రోషిణి (20) అనే మహిళ ఇటుకబట్టిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

శాలిగౌరారం 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మహిళ ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ వెళ్లే వీలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను సుమారు 2 కిలోమీటర్ల దూరం స్కూప్ స్ట్రక్చర్‌పై మోసుకుంటూ అంబులెన్స్‌ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో రోషిణి సాఫల్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా గర్భిణిని ఎండలో రెండు కిలోమీటర్ల పాటు మోసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన 108 సిబ్బంది పైలెట్ సమీర్, ఈఎంటీ హేమంత్ సేవలను స్థానికులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News