Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:55 PM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరిశోధనలకు నూతన దిశ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరిశోధనలకు నూతన దిశ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరిశోధనలకు నూతన దిశ
May 05, 2026 07:05 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇన్‌ఫ్లిబ్‌నెట్‌తో ఒప్పందం – 13 వేల జర్నల్స్ ఉచితం

హైదరాబాద్,

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిశోధనలను బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ విద్యా వసతుల అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. ఈ మేరకు యూనివర్సిటీ, ఇన్‌ఫ్లిబ్‌నెట్ సెంటర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఇన్‌ఫ్లిబ్‌నెట్ డైరెక్టర్ ప్రొ. దేవికా మడళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS)’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 13 వేల పరిశోధనా జర్నల్స్ పరిశోధకులు, అధ్యాపకులకు ఉచితంగా అందుబాటులోకి రానున్నట్లు వీసీ తెలిపారు.

ఇన్‌ఫ్లిబ్‌నెట్ ‘కార్నెట్’ను ఆవిష్కరించారు. చెట్టు ఆకారంలో రూపొందించిన ఈ నమూనాలో క్యూఆర్ కోడ్‌ల ద్వారా ‘షోధ్‌చక్ర’ పరిశోధన నిర్వహణ వ్యవస్థకు సులభంగా ప్రాప్యత లభిస్తుంది. ప్రవేశం నుంచి థీసిస్ సమర్పణ వరకు ప్రతి దశలో మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పరిశోధన నాణ్యతను పెంచేందుకు ప్లగరిజం తనిఖీ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తేనున్నారు. తద్వారా ప్రతి థీసిస్‌ను సమగ్రంగా పరిశీలించి ‘షోధ్‌గంగ’లో అప్‌లోడ్ చేయనున్నారు. దీని ద్వారా పరిశోధన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

అదేవిధంగా యూనివర్సిటీ, ఇన్‌ఫ్లిబ్‌నెట్ భాగస్వామ్యంతో 1.5 లక్షల మంది విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS) అందుబాటులోకి రానుంది. వీడియో, ఆడియో, పాఠ్య రూపంలో ఉన్న విద్యా వనరులతో పాటు మైక్రో-క్రెడెన్షియల్స్ కోర్సులు కూడా అభ్యసించే అవకాశం కల్పించనున్నారు.

ఈ ఒప్పందం ద్వారా పరిశోధన మద్దతు వ్యవస్థలు, డిజిటల్ వనరులు, అకాడమిక్ సహకారం మరింత బలోపేతం కానున్నాయి. ఇన్‌ఫ్లిబ్‌నెట్ నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు యూనివర్సిటీ వేదిక కానుందని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమాలు ‘ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-USHA)’ పథకం కింద అమలు కానున్నాయి.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, ప్రొ. ఎన్. రజని, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. కె. శ్రీదేవి, డా. వై. వెంకటేశ్వర్లు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News