అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ
అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ
Editor Desk
రామన్నపేట,
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్చార్జి నకిరేగంటి మొగులయ్య, మండల ఇన్చార్జి కొరివి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించి ప్రతి వర్గానికి సమాన న్యాయం అందించాలన్న అంబేద్కర్ ఆశయాలు దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” స్ఫూర్తితో సామాజిక సాధికారత దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక నిర్ణయాలే అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, గోపవరం ధర్మరాజు, మద్దెలపూరి ఐలయ్య, జిల్లా లక్ష్మీనారాయణ, రాపోలు స్వామి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, మండల జనరల్ సెక్రటరీలు బెజ్జంకి శివకుమార్, జంగిలి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజని, బట్టి రమేష్, కార్యదర్శులు బతక్క నరేష్, బందెల సంజీవ, రేపాక లింగస్వామి, బీజేపీ నాయకులు వావిళ్ళ సంతోష్, ఐలాపురం అశోక్, మచ్చ మహేష్, బోయపల్లి ప్రవీణ్, బతక్క సైదులు, వీరమల్ల గణేష్, సురవి మల్లేష్, బొడ్డుపల్లి సైదులు, సిల్వర్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి