Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:16 PM

అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ

అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ

అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ
April 14, 2026 04:31 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్చార్జి నకిరేగంటి మొగులయ్య, మండల ఇన్చార్జి కొరివి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించి ప్రతి వర్గానికి సమాన న్యాయం అందించాలన్న అంబేద్కర్ ఆశయాలు దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” స్ఫూర్తితో సామాజిక సాధికారత దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక నిర్ణయాలే అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, గోపవరం ధర్మరాజు, మద్దెలపూరి ఐలయ్య, జిల్లా లక్ష్మీనారాయణ, రాపోలు స్వామి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, మండల జనరల్ సెక్రటరీలు బెజ్జంకి శివకుమార్, జంగిలి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజని, బట్టి రమేష్, కార్యదర్శులు బతక్క నరేష్, బందెల సంజీవ, రేపాక లింగస్వామి, బీజేపీ నాయకులు వావిళ్ళ సంతోష్, ఐలాపురం అశోక్, మచ్చ మహేష్, బోయపల్లి ప్రవీణ్, బతక్క సైదులు, వీరమల్ల గణేష్, సురవి మల్లేష్, బొడ్డుపల్లి సైదులు, సిల్వర్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News