Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:17 PM

అంబేద్కర్ ఆశయాల అమలే నిజమైన నివాళి. మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి

అంబేద్కర్ ఆశయాల అమలే నిజమైన నివాళి. మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి

అంబేద్కర్ ఆశయాల అమలే నిజమైన నివాళి. మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి
April 14, 2026 04:35 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి అన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని మునిపంపుల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం విశేష కృషి చేసి సమాజంలో సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు.

దేశంలోని ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని తెలిపారు. 1990లో బీజేపీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయడం గర్వకారణమని గుర్తుచేశారు.

అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ప్రధాన ప్రదేశాలను గుర్తించి ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు యాదాసు లక్ష్మణ్, సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, సిందం లింగయ్య, గుండాల అంజయ్య, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, కర్నాటి నరేష్, కర్నాటి రాము, బూడిద మల్లేష్, పాలాల శేఖర్, కూరెళ్ల రామకృష్ణ, గాదే స్వామి, సురపల్లి వీరేందర్, బూడిద గణేష్, కన్నెకంటి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News