Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 08:18 PM

99 రూపాయలు లేకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా..?’ శ్రీనివాస్ గౌడ్

99 రూపాయలు లేకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా..?’ శ్రీనివాస్ గౌడ్

99 రూపాయలు లేకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా..?’ శ్రీనివాస్ గౌడ్
April 16, 2026 06:31 PM 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

‘నిధులు లేకుండా ప్రణాళికలు ఎలా?’

రామన్నపేట సమావేశంలో సర్పంచుల ఫైర్

రామన్నపేట: మండలంలో నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బిఆర్‌ఎస్, ఇతర ప్రతిపక్ష సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ గ్రామాలకు నిధులు ఇవ్వకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలంటూ ప్రశ్నించారు. “99 రూపాయలు కూడా ఇవ్వకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా అమలు చేస్తాం..?” అని నిలదీశారు. మహిళా సంఘ భవనాల కేటాయింపులో అధికార పార్టీ గ్రామాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

వెల్లంకి, సిరిపురం, బోగారం, ఇంద్రపాలనగరం, పల్లివాడ, లక్ష్మాపురం, దుబ్బాక, మునిపంపుల, కుంకుడు పాముల గ్రామాలకు తీర్మాన కాపీలు ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో పారదర్శకత లేకపోవడంపై సర్పంచులు మండిపడ్డారు. గ్రామపంచాయతీల్లో కుర్చీలు, టేబుళ్లు నుంచి కరెంటు బిల్లుల వరకు సొంతంగా భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు సమస్యలు, ఐకేపీ సెంటర్ల ప్రారంభోత్సవాలకు సర్పంచులను పిలవకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో సర్పంచులను పక్కనపెడుతున్నారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై స్పెషల్ అధికారి శ్రీమతి సాహితి స్పందిస్తూ అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సమావేశం మొత్తం అధికారుల తీరుపై అసంతృప్తి, ఆగ్రహంతో ముగిసింది. కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎస్ఐ నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News