Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 09:49 PM

చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్

చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్

చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్
April 16, 2026 07:02 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు,

జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. గురువారం ఆలేరు గౌడ సంఘ భవనంలో చేనేత కార్మికుల కోసం “ఆరోగ్య భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించారు.

చేతి మగ్గాలపై పట్టు దారాలతో వస్త్రాలను నేసే చేనేత వృత్తి సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతుండగా, ఈ వృత్తిలో ఉన్న కార్మికులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో జిల్లా ఆరోగ్య శాఖ, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖల సమన్వయంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి భాస్కర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరంలో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు, ల్యాబ్ పరీక్షలు అందించారు. హెల్త్ కార్డులు పంపిణీ చేసి, ప్రతి కార్మికుడి వైద్య వివరాలను నమోదు చేశారు. అవసరమైన మందులు కూడా అందజేశారు.

చేనేత కార్మికులు వృత్తి కారణంగా అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటారని, ఇలాంటి మెడికల్ క్యాంపులు వారికి ఉపయుక్తంగా ఉంటాయని మున్సిపల్ చైర్‌పర్సన్ పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చికిత్స పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, DRDA PD నాగిరెడ్డి, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, చేనేత సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News