చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్
చేనేత కార్మికులకు ‘ఆరోగ్య భరోసా’… వైద్య శిబిరాలకు మంచి స్పందన. అదనపు కలెక్టర్
Editor Desk
ఆలేరు,
జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. గురువారం ఆలేరు గౌడ సంఘ భవనంలో చేనేత కార్మికుల కోసం “ఆరోగ్య భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించారు.
చేతి మగ్గాలపై పట్టు దారాలతో వస్త్రాలను నేసే చేనేత వృత్తి సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతుండగా, ఈ వృత్తిలో ఉన్న కార్మికులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో జిల్లా ఆరోగ్య శాఖ, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖల సమన్వయంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి భాస్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరంలో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు, ల్యాబ్ పరీక్షలు అందించారు. హెల్త్ కార్డులు పంపిణీ చేసి, ప్రతి కార్మికుడి వైద్య వివరాలను నమోదు చేశారు. అవసరమైన మందులు కూడా అందజేశారు.
చేనేత కార్మికులు వృత్తి కారణంగా అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటారని, ఇలాంటి మెడికల్ క్యాంపులు వారికి ఉపయుక్తంగా ఉంటాయని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చికిత్స పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, DRDA PD నాగిరెడ్డి, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, చేనేత సంఘ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి