చౌటుప్పల్లో స్కూటీ దొంగ అరెస్ట్ – నాలుగు వాహనాల స్వాధీనం
చౌటుప్పల్లో స్కూటీ దొంగ అరెస్ట్ – నాలుగు వాహనాల స్వాధీనం
K.RAVI
వలిగొండ ఎక్స్రోడ్ వద్ద పోలీసుల చెకింగ్లో పట్టుబడిన యువకుడు
చౌటుప్పల్ పట్టణంలో జరిగిన స్కూటీ దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గుండ్రంపల్లి గ్రామానికి చెందిన గరిసే రామస్వామి తన Destini 125 స్కూటీ (TS05FV7147) ను 01.04.2026న చౌటుప్పల్లోని ఎల్లప్ప హోటల్ సెల్లార్లో పార్క్ చేసి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ ఆదేశాల మేరకు ఎస్.ఐ కనకటి యాదగిరి, సిబ్బంది మల్లాం సందీప్, ఎం.భారద్వాజ్, ఉడుగు సైదులు కలిసి 04.04.2026 ఉదయం వలిగొండ ఎక్స్రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక వ్యక్తి స్కూటీపై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి వెంటనే పట్టుకున్నారు. విచారణలో అతను నార్కట్పల్లి ఎస్సీ కాలనీకి చెందిన పండుల విష్ణువర్ధన్ అలియాస్ చింటు (21)గా గుర్తించారు. అతను చౌటుప్పల్లో ఎల్లప్ప హోటల్ సెల్లార్ నుంచి స్కూటీ దొంగిలించానని ఒప్పుకున్నాడు. అదేవిధంగా గతంలో మరిన్ని మూడు బైక్లుదొంగిలించినట్లు తెలిపాడు.నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసిన వాహనాలు: TS05FE7147 – Destini 125 స్కూటీ (చౌటుప్పల్ కేసు), TS30E6919 – యూనికార్న్ బైక్, AP24Y4578 – గ్లామర్ బైక్ (హయత్నగర్ కేసు), AP24AM3551 – స్ప్లెండర్ ప్లస్ (నల్గొండ 2 టౌన్ కేసు) నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ అనంతరం శనివారం న్యాయస్థానానికి హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి