Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

చౌటుప్పల్‌లో స్కూటీ దొంగ అరెస్ట్ – నాలుగు వాహనాల స్వాధీనం

చౌటుప్పల్‌లో స్కూటీ దొంగ అరెస్ట్ – నాలుగు వాహనాల స్వాధీనం

చౌటుప్పల్‌లో స్కూటీ దొంగ అరెస్ట్ – నాలుగు వాహనాల స్వాధీనం
04-04-2026 655 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వలిగొండ ఎక్స్‌రోడ్ వద్ద పోలీసుల చెకింగ్‌లో పట్టుబడిన యువకుడు

చౌటుప్పల్ పట్టణంలో జరిగిన స్కూటీ దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గుండ్రంపల్లి గ్రామానికి చెందిన గరిసే రామస్వామి తన Destini 125 స్కూటీ (TS05FV7147) ను 01.04.2026న చౌటుప్పల్‌లోని ఎల్లప్ప హోటల్ సెల్లార్‌లో పార్క్ చేసి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ ఆదేశాల మేరకు ఎస్‌.ఐ కనకటి యాదగిరి, సిబ్బంది మల్లాం సందీప్, ఎం.భారద్వాజ్, ఉడుగు సైదులు కలిసి 04.04.2026 ఉదయం వలిగొండ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక వ్యక్తి స్కూటీపై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి వెంటనే పట్టుకున్నారు. విచారణలో అతను నార్కట్‌పల్లి ఎస్సీ కాలనీకి చెందిన పండుల విష్ణువర్ధన్ అలియాస్ చింటు (21)గా గుర్తించారు. అతను చౌటుప్పల్‌లో ఎల్లప్ప హోటల్ సెల్లార్ నుంచి స్కూటీ దొంగిలించానని ఒప్పుకున్నాడు. అదేవిధంగా గతంలో మరిన్ని మూడు బైక్‌లుదొంగిలించినట్లు తెలిపాడు.నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసిన వాహనాలు: TS05FE7147 – Destini 125 స్కూటీ (చౌటుప్పల్ కేసు), TS30E6919 – యూనికార్న్ బైక్, AP24Y4578 – గ్లామర్ బైక్ (హయత్‌నగర్ కేసు), AP24AM3551 – స్ప్లెండర్ ప్లస్ (నల్గొండ 2 టౌన్ కేసు) నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ అనంతరం శనివారం న్యాయస్థానానికి హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో స్కూటీ దొంగ అరెస్ట్ – నాలుగు వాహనాల స్వాధీనం

Article Image

వలిగొండ ఎక్స్‌రోడ్ వద్ద పోలీసుల చెకింగ్‌లో పట్టుబడిన యువకుడు

చౌటుప్పల్ పట్టణంలో జరిగిన స్కూటీ దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గుండ్రంపల్లి గ్రామానికి చెందిన గరిసే రామస్వామి తన Destini 125 స్కూటీ (TS05FV7147) ను 01.04.2026న చౌటుప్పల్‌లోని ఎల్లప్ప హోటల్ సెల్లార్‌లో పార్క్ చేసి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ ఆదేశాల మేరకు ఎస్‌.ఐ కనకటి యాదగిరి, సిబ్బంది మల్లాం సందీప్, ఎం.భారద్వాజ్, ఉడుగు సైదులు కలిసి 04.04.2026 ఉదయం వలిగొండ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక వ్యక్తి స్కూటీపై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి వెంటనే పట్టుకున్నారు. విచారణలో అతను నార్కట్‌పల్లి ఎస్సీ కాలనీకి చెందిన పండుల విష్ణువర్ధన్ అలియాస్ చింటు (21)గా గుర్తించారు. అతను చౌటుప్పల్‌లో ఎల్లప్ప హోటల్ సెల్లార్ నుంచి స్కూటీ దొంగిలించానని ఒప్పుకున్నాడు. అదేవిధంగా గతంలో మరిన్ని మూడు బైక్‌లుదొంగిలించినట్లు తెలిపాడు.నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసిన వాహనాలు: TS05FE7147 – Destini 125 స్కూటీ (చౌటుప్పల్ కేసు), TS30E6919 – యూనికార్న్ బైక్, AP24Y4578 – గ్లామర్ బైక్ (హయత్‌నగర్ కేసు), AP24AM3551 – స్ప్లెండర్ ప్లస్ (నల్గొండ 2 టౌన్ కేసు) నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ అనంతరం శనివారం న్యాయస్థానానికి హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News