అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
Biksham
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న స్థానికుల ఆరోపణలు
సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
చివ్వెంల మండలం ఎంజి నగర్ తండాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తండాకు చెందిన రత్నావత్ మణి భార్గవ్ మృతదేహం గ్రామ పరిసరాల్లో ఆటో పక్కన పడి ఉన్నట్లు గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని మెడపై ఉరివేసినట్లుగా గుర్తులు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై స్థానికులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. నిజానిజాలు వెలికితీయాలని, దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి