Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:20 AM

భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం

భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం

 భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం
April 11, 2026 09:49 AM 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం భీమారం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కలంచెర్ల జానయ్య (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళ అత్యంత క్రూరంగా హత్య చేశారు. బాధితుడు యాదవ కులానికి చెందినవాడు కాగా, రోజువారీగా తన గొర్రెలను కాపాడుతూ జీవనం సాగించేవాడు.స్థానికుల సమాచారం మేరకు, జానయ్య ప్రతి రోజు లాగే గొర్రెలను కాపాడుకుని వచ్చి దొడ్డిలో ఉంచి అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బండరాయితో మోది హతమార్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, మృతుడిపై ఉన్న బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులు ఏవీ దుండగులు అపహరించలేదు. దీంతో ఈ హత్య వెనుక వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర కారణాలు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News