భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం
భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం భీమారం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కలంచెర్ల జానయ్య (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళ అత్యంత క్రూరంగా హత్య చేశారు. బాధితుడు యాదవ కులానికి చెందినవాడు కాగా, రోజువారీగా తన గొర్రెలను కాపాడుతూ జీవనం సాగించేవాడు.స్థానికుల సమాచారం మేరకు, జానయ్య ప్రతి రోజు లాగే గొర్రెలను కాపాడుకుని వచ్చి దొడ్డిలో ఉంచి అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బండరాయితో మోది హతమార్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, మృతుడిపై ఉన్న బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులు ఏవీ దుండగులు అపహరించలేదు. దీంతో ఈ హత్య వెనుక వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర కారణాలు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి