Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం

భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం

 భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం
April 11, 2026 09:49 AM 389 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం భీమారం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కలంచెర్ల జానయ్య (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళ అత్యంత క్రూరంగా హత్య చేశారు. బాధితుడు యాదవ కులానికి చెందినవాడు కాగా, రోజువారీగా తన గొర్రెలను కాపాడుతూ జీవనం సాగించేవాడు.స్థానికుల సమాచారం మేరకు, జానయ్య ప్రతి రోజు లాగే గొర్రెలను కాపాడుకుని వచ్చి దొడ్డిలో ఉంచి అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బండరాయితో మోది హతమార్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, మృతుడిపై ఉన్న బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులు ఏవీ దుండగులు అపహరించలేదు. దీంతో ఈ హత్య వెనుక వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర కారణాలు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News