PRINT TIME: July 10, 2026 09:47 PM
25ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు
25ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు
June 01, 2026 08:26 PM
27 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు బోయ లింగస్వామి మాజీ ఉపసర్పంచ్, బాతరాజు రాజేష్, వంగాల లింగస్వామి, సుక్క విజయ్, ఎండి జుబేద్, శేఖర్, ఐలయ్య, మంజుల, పుష్పలత, మధుసూదన్ రెడ్డి 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి