PRINT TIME: April 28, 2026 06:33 PM
25 గొర్రెల మృతి పట్ల తక్షణమే స్పందించిన మంత్రి సవిత
25 గొర్రెల మృతి పట్ల తక్షణమే స్పందించిన మంత్రి సవిత
April 28, 2026 04:15 PM
45 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో బాధితుడికి సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత వెంటనే స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు గ్రామానికి చేరుకుని బాధితుడు నాగన్నను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి