25 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
25 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
K.RAVI
చౌటుప్పల్ జెడ్ పి హెచ్ ఎస్ 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కె రవి
కాలం దూరం చేసిన స్నేహ బంధాలు, బాల్య జ్ఞాపకాలతో నిండిన స్నేహాలు మరోసారి హృదయాలను దగ్గర చేసుకున్నాయి. చౌటుప్పల్ జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ 1998–99 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం భావోద్వేగాలతో,ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగింది. మల్కాపురం ఆందోల్ మైసమ్మ ఆవరణలో జరిగిన ఈ రీయూనియన్కు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల జీవితం ఇచ్చిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటి అనుభవాలు, గురువుల మార్గదర్శకత్వం, విద్యార్థి దశలోని సరదా క్షణాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. కాలం ఎంత మారినా స్నేహం మాత్రం అలాగే నిలిచిందని ఈ కలయిక మరోసారి రుజువు చేసింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాటి ఉపాధ్యాయులను పూల వర్షంతో, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతించారు.విద్యార్థుల స్వీయ పరిచయంతో మొదలైన కార్యక్రమం, జీవిత ప్రయాణంలోని అనుభవాలను పంచుకునే వేడుకగా మారింది. గురువులు అందించిన విలువలు తమ జీవితాలకు బలంగా నిలిచాయని పలువురు విద్యార్థులు భావోద్వేగంగా వెల్లడించారు. పాఠశాల నేర్పిన క్రమశిక్షణ, బాధ్యత, మానవ విలువలు తమ విజయాలకు పునాదిగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి