Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్పీ మధుసూదన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 09:26 PM

15 రోజులలో యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేయాలి..

15 రోజులలో యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేయాలి..

15 రోజులలో  యుద్ధప్రాతిపదికన ధాన్యం  కొనుగోళ్లు చేయాలి..
May 05, 2026 08:11 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అధికారులకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం..

నల్గొండ : రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియను రానున్న 15 రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెదకాపర్తి కొనుగోలు కేంద్రాన్ని, వట్టిమర్తిలోని రైస్ మిల్లును తనిఖీ చేశారు. అనంతరం సూర్యాపేట వెళ్తూ మార్గమధ్యలో నల్గొండ సమీపంలోని కామినేని ఆస్పత్రి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని తద్వారా రైతులకు నగదు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. తూకం, రవాణా, హమాలీల లభ్యతపై నిరంతరం నిఘా ఉంచాలని మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులకు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

మిల్లర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాం..

ఈ ఏడాది ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసిందని కమిషనర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కోట్ల కొత్త గన్ని బ్యాగులను అందుబాటులోకి తెచ్చామని మిల్లర్లకు చెల్లించాల్సిన ఛార్జీలతో పాటు బాయిల్డ్ రైస్ టార్గెట్‌ను కూడా అడ్వాన్స్‌గా కేటాయించామని చెప్పారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందుతున్నందున మిల్లర్లు కూడా ధాన్యం అన్లోడింగ్‌లో వేగం పెంచి సహకరించాలని కోరారు. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా అదనపు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎక్కడ హమాలీల కొరత ఉన్నా వెంటనే సమీప ప్రాంతాల నుండి రప్పించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో 457 కేంద్రాలు..

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లాలోని సేకరణ వివరాలను వివరిస్తూ.. జిల్లావ్యాప్తంగా 457 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కమిషనర్‌కు తెలిపారు. ధాన్యం రవాణా కోసం మిల్లులకు ప్రత్యేకంగా 800 లారీలను కేటాయించామని, హమాలీల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ అధికారులు, రవాణా, సహకార, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News