Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:25 AM

యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం

యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం

యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం
19-02-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండలం లోని బోరంచ గ్రామంలో గురువారం రోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడింది. గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో డప్పులు, తాళాలు మోగిస్తూ, జెండాలు ఎగురవేస్తూ శివాజీ మహారాజ్ జయజయధ్వానాలతో గ్రామం మార్మోగింది. ప్రముఖులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాల గురించి వివరించారు. యువతలో దేశభక్తి స్పూర్తిని పెంపొందించడంలో శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శమని వారు పేర్కొన్నారు.వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ మహోత్సవం విజయవంతంగా నిర్వహించబడటం విశేషం.గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో యువతలో జాతీయ భావం మరింత బలపడుతుందని, భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తిదాయక కేంద్రంగా నిలుస్తుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం బోరంచ గ్రామ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని అందరూ పేర్కొన్నారు.

Sthanikam

యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండలం లోని బోరంచ గ్రామంలో గురువారం రోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడింది. గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో డప్పులు, తాళాలు మోగిస్తూ, జెండాలు ఎగురవేస్తూ శివాజీ మహారాజ్ జయజయధ్వానాలతో గ్రామం మార్మోగింది. ప్రముఖులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాల గురించి వివరించారు. యువతలో దేశభక్తి స్పూర్తిని పెంపొందించడంలో శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శమని వారు పేర్కొన్నారు.వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ మహోత్సవం విజయవంతంగా నిర్వహించబడటం విశేషం.గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో యువతలో జాతీయ భావం మరింత బలపడుతుందని, భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తిదాయక కేంద్రంగా నిలుస్తుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం బోరంచ గ్రామ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని అందరూ పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News