యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం
యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండలం లోని బోరంచ గ్రామంలో గురువారం రోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడింది. గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో డప్పులు, తాళాలు మోగిస్తూ, జెండాలు ఎగురవేస్తూ శివాజీ మహారాజ్ జయజయధ్వానాలతో గ్రామం మార్మోగింది. ప్రముఖులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాల గురించి వివరించారు. యువతలో దేశభక్తి స్పూర్తిని పెంపొందించడంలో శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శమని వారు పేర్కొన్నారు.వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ మహోత్సవం విజయవంతంగా నిర్వహించబడటం విశేషం.గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో యువతలో జాతీయ భావం మరింత బలపడుతుందని, భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తిదాయక కేంద్రంగా నిలుస్తుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం బోరంచ గ్రామ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని అందరూ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి