Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
January 26, 2026 07:20 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

భారత రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.భారతదేశం పూర్తి స్థాయి గణతంత్రంగా అవతరించిన రోజు జనవరి 26 అని ఆయన గుర్తు చేశారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో, దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం లభించాయని చెప్పారు. ఈ రోజున జరుపుకునే గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాక, రాజ్యాంగం విలువలను గౌరవించే రోజు అని నవోదయ సిద్దు అన్నారు. దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ నిర్మాణానికి ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు.ప్రతి పౌరుడు తన హక్కులను మాత్రమే కాక, బాధ్యతలను కూడా గుర్తించాలి. అప్పుడే దేశం నిజమైన గణతంత్ర దేశంగా ముందుకు సాగగలదని ఆయన భావన వ్యక్తం చేశారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా వారు దేశాభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా పాల్గొనగలరని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News