యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ
భారత రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.భారతదేశం పూర్తి స్థాయి గణతంత్రంగా అవతరించిన రోజు జనవరి 26 అని ఆయన గుర్తు చేశారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో, దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం లభించాయని చెప్పారు. ఈ రోజున జరుపుకునే గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాక, రాజ్యాంగం విలువలను గౌరవించే రోజు అని నవోదయ సిద్దు అన్నారు. దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ నిర్మాణానికి ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు.ప్రతి పౌరుడు తన హక్కులను మాత్రమే కాక, బాధ్యతలను కూడా గుర్తించాలి. అప్పుడే దేశం నిజమైన గణతంత్ర దేశంగా ముందుకు సాగగలదని ఆయన భావన వ్యక్తం చేశారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా వారు దేశాభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా పాల్గొనగలరని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి