Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న గుడిపల్లి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి మెదడు కత్తెరల మధ్య 'హనుమాన్ చాలీసా'.. అనస్థీషియా లేకుండా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ! భాగ్యలక్ష్మి ధైర్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఎడిటర్ శ్రీ కొండా మల్లేశం గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 07:04 PM

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య
April 07, 2026 05:04 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మెడికల్ కాలేజీ నుంచి ఐబి వరకు కొనసాగిన ఈ రన్‌లో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.సాధారణంగా మధ్య వయస్సు వచ్చిన తర్వాతే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, కానీ ప్రస్తుత యువత ముందుగానే ఆరోగ్యంపై దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా సమతుల్య ఆహారం, వ్యాయామం,పరిశుభ్రత, మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి ముఖ్యమైన అంశాలని, యువత ఇవి పాటించి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథంతో జీవిస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని, రోజువారీ జీవితంలో ఒత్తిడి, చిరాకు తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, డీఎస్పీ సత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మెడికల్ విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News