Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య
April 07, 2026 05:04 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మెడికల్ కాలేజీ నుంచి ఐబి వరకు కొనసాగిన ఈ రన్‌లో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.సాధారణంగా మధ్య వయస్సు వచ్చిన తర్వాతే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, కానీ ప్రస్తుత యువత ముందుగానే ఆరోగ్యంపై దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా సమతుల్య ఆహారం, వ్యాయామం,పరిశుభ్రత, మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి ముఖ్యమైన అంశాలని, యువత ఇవి పాటించి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథంతో జీవిస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని, రోజువారీ జీవితంలో ఒత్తిడి, చిరాకు తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, డీఎస్పీ సత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మెడికల్ విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News