Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:04 AM

యువత చదువుతో పాటు క్రీడల్లోనురాణించాలి వేముల విపుల్

యువత చదువుతో పాటు క్రీడల్లోనురాణించాలి వేముల విపుల్

యువత చదువుతో పాటు క్రీడల్లోనురాణించాలి వేముల విపుల్
January 14, 2026 02:17 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

నకిరేకల్ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నకిరేకల్ నియోజకవర్గంలో యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ అన్నారు.

బుధవారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువత ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News