Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...
January 17, 2026 09:37 AM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్

- బిజిలీపూర్ లో వాలీబాల్, కబడ్డీ క్రిడల విజేతలకు బహుమతుల ప్రధానం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:అందోల్ నియోజకవర్గంలో

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు అరగొండ మహానంద అరవింద్ ఆద్వర్యంలో సీడిఆర్ వాలీబాల్, కబడ్డీ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. వాలీబాల్ పోటీలో శివాజీ యూత్ టీం మొదటి బహుమతి, భరత్ టీం రెండవ బహుమతి, కబడ్డీ పోటీలో నరేష్ టీం ప్రథమ బహుమతి, లోకేష్ టీం ద్వితీయ బహుమతి సాధించాయి.అంతకు ముందు కబడ్డీ ఫైనల్ పోరు సందర్భంగా వినయ్ గౌడ్ టాస్‌ వేసి అనంతరం కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు క్రీడల ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, దీంతోపాటు మానసిక ఉల్లాసానికి, శారీరక ధారుడ్యానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. క్రీడా పోటీలలో ప్రతి ఒక్కరూ గెలుపు, ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపేవారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందని గ్రామీణ క్రీడల్లో రాణించే వారు జాతీయ స్థాయి ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతను కల్పిస్తూ , గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తోందన్నారు. జీవితంలో స్థిరపడాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా భవిష్యత్‌లో స్పోర్ట్స్‌ కోటా ఉంటుందని తెలపారు. కార్యక్రమంలో బిజిలీపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగప్ప, సర్పంచ్ నాగమణి నర్సింలు, కేరుర్ గ్రామ సర్పంచ్ కార్తీక్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్,వార్డు మెంబర్లు, మల్లేశం,కాశినాథ్,కుమార్, శివశంకర్, మాజీ ఏంపిటిసి సదానందం తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News