యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...
Sthanikam District Staff Reporter krishna
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్
- బిజిలీపూర్ లో వాలీబాల్, కబడ్డీ క్రిడల విజేతలకు బహుమతుల ప్రధానం
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:అందోల్ నియోజకవర్గంలో
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు అరగొండ మహానంద అరవింద్ ఆద్వర్యంలో సీడిఆర్ వాలీబాల్, కబడ్డీ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. వాలీబాల్ పోటీలో శివాజీ యూత్ టీం మొదటి బహుమతి, భరత్ టీం రెండవ బహుమతి, కబడ్డీ పోటీలో నరేష్ టీం ప్రథమ బహుమతి, లోకేష్ టీం ద్వితీయ బహుమతి సాధించాయి.అంతకు ముందు కబడ్డీ ఫైనల్ పోరు సందర్భంగా వినయ్ గౌడ్ టాస్ వేసి అనంతరం కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు క్రీడల ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, దీంతోపాటు మానసిక ఉల్లాసానికి, శారీరక ధారుడ్యానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. క్రీడా పోటీలలో ప్రతి ఒక్కరూ గెలుపు, ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపేవారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందని గ్రామీణ క్రీడల్లో రాణించే వారు జాతీయ స్థాయి ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతను కల్పిస్తూ , గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందన్నారు. జీవితంలో స్థిరపడాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా భవిష్యత్లో స్పోర్ట్స్ కోటా ఉంటుందని తెలపారు. కార్యక్రమంలో బిజిలీపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగప్ప, సర్పంచ్ నాగమణి నర్సింలు, కేరుర్ గ్రామ సర్పంచ్ కార్తీక్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్,వార్డు మెంబర్లు, మల్లేశం,కాశినాథ్,కుమార్, శివశంకర్, మాజీ ఏంపిటిసి సదానందం తో పాటు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి