Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...
January 17, 2026 09:37 AM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్

- బిజిలీపూర్ లో వాలీబాల్, కబడ్డీ క్రిడల విజేతలకు బహుమతుల ప్రధానం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:అందోల్ నియోజకవర్గంలో

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు అరగొండ మహానంద అరవింద్ ఆద్వర్యంలో సీడిఆర్ వాలీబాల్, కబడ్డీ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. వాలీబాల్ పోటీలో శివాజీ యూత్ టీం మొదటి బహుమతి, భరత్ టీం రెండవ బహుమతి, కబడ్డీ పోటీలో నరేష్ టీం ప్రథమ బహుమతి, లోకేష్ టీం ద్వితీయ బహుమతి సాధించాయి.అంతకు ముందు కబడ్డీ ఫైనల్ పోరు సందర్భంగా వినయ్ గౌడ్ టాస్‌ వేసి అనంతరం కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు క్రీడల ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, దీంతోపాటు మానసిక ఉల్లాసానికి, శారీరక ధారుడ్యానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. క్రీడా పోటీలలో ప్రతి ఒక్కరూ గెలుపు, ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపేవారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందని గ్రామీణ క్రీడల్లో రాణించే వారు జాతీయ స్థాయి ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతను కల్పిస్తూ , గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తోందన్నారు. జీవితంలో స్థిరపడాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా భవిష్యత్‌లో స్పోర్ట్స్‌ కోటా ఉంటుందని తెలపారు. కార్యక్రమంలో బిజిలీపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగప్ప, సర్పంచ్ నాగమణి నర్సింలు, కేరుర్ గ్రామ సర్పంచ్ కార్తీక్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్,వార్డు మెంబర్లు, మల్లేశం,కాశినాథ్,కుమార్, శివశంకర్, మాజీ ఏంపిటిసి సదానందం తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News