యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం
యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం
Krishna
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కల్పగుర్, అంగడిపేట్, మల్కాపూర్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రాఫిక్ నియమాలు, సైబర్ క్రైమ్, పోక్సో చట్టంపై ర్యాలీలు, సదస్సులు నిర్వహించి విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ట్రాఫిక్ ఎస్ఐలు సాయిలు, రాములు, గోప్య చౌహన్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్ ధరించడం, లైసెన్స్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండడం తప్పనిసరి అని సూచించగా, మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల మెసేజ్లు, ఓటీపీలు పంచుకోవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై కూడా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ పరికరాల వినియోగాన్ని ప్రత్యక్షంగా చూపించి విద్యార్థులకు వివరించగా,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ఆరోగ్యం, విద్య, సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి