Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 08:31 PM

యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం

యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం

యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం
March 28, 2026 06:41 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కల్పగుర్, అంగడిపేట్, మల్కాపూర్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రాఫిక్ నియమాలు, సైబర్ క్రైమ్, పోక్సో చట్టంపై ర్యాలీలు, సదస్సులు నిర్వహించి విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ట్రాఫిక్ ఎస్ఐలు సాయిలు, రాములు, గోప్య చౌహన్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్ ధరించడం, లైసెన్స్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండడం తప్పనిసరి అని సూచించగా, మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల మెసేజ్లు, ఓటీపీలు పంచుకోవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై కూడా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ పరికరాల వినియోగాన్ని ప్రత్యక్షంగా చూపించి విద్యార్థులకు వివరించగా,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ఆరోగ్యం, విద్య, సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News