యువకుడి హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
యువకుడి హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
Harish K
కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో అనుమానస్పద స్థితిలో యువకుని మృతి దేహం
హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసును చేదిస్తాం
కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది గణపవరం గ్రామ శివారులో యువకుని మృతుదేహం పడి ఉన్నదని సమాచారం కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ గా గుర్తించడం జరిగినది.యువకుని హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి తో కలిసి పరిశీలించారు.మృతుని యొక్క వివరాలను స్థానికులను,పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.హత్య గల కారణాలను ఛేదించి నేరానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపినారు.ఘటన స్థలంలో క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ టీం, డాగ్ స్క్వాడ్ టీం సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసు ఛేదించి నేరస్థులను పట్టుకుంటాం అని ఎస్పీ తెలిపినారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి