Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” “నన్ను కాపాడండి.. లేకపోతే నేలకూలుతా!” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:17 PM

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన
16-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విధుల బహిష్కరణ… అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు డిమాండ్

రామన్నపేట లో యువ న్యాయవాది మహమ్మద్ కదీర్ హత్య ఘటనపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తమైంది. దారుణ సంఘటనను ఖండిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తక్షణమే “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్” అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవృత్తిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ కదీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Sthanikam

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

Article Image

విధుల బహిష్కరణ… అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు డిమాండ్

రామన్నపేట లో యువ న్యాయవాది మహమ్మద్ కదీర్ హత్య ఘటనపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తమైంది. దారుణ సంఘటనను ఖండిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తక్షణమే “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్” అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవృత్తిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ కదీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News