PRINT TIME: May 27, 2026 05:27 AM
యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన
యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన
February 16, 2026 11:23 AM
79 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
విధుల బహిష్కరణ… అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కు డిమాండ్
రామన్నపేట లో యువ న్యాయవాది మహమ్మద్ కదీర్ హత్య ఘటనపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తమైంది. దారుణ సంఘటనను ఖండిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తక్షణమే “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్” అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవృత్తిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ కదీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి