Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:44 AM

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన

యువ న్యాయవాది హత్యపై రామన్నపేటలో నిరసన
February 16, 2026 11:23 AM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విధుల బహిష్కరణ… అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు డిమాండ్

రామన్నపేట లో యువ న్యాయవాది మహమ్మద్ కదీర్ హత్య ఘటనపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తమైంది. దారుణ సంఘటనను ఖండిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తక్షణమే “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్” అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవృత్తిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ కదీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News