Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:55 PM

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం
February 05, 2026 01:03 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్వప్న (34) అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.యువ న్యాయవాది హత్యతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, న్యాయవాదుల రక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News