Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:51 PM

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం
February 05, 2026 01:03 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్వప్న (34) అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.యువ న్యాయవాది హత్యతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, న్యాయవాదుల రక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News