Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:21 PM

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం
05-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్వప్న (34) అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.యువ న్యాయవాది హత్యతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, న్యాయవాదుల రక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

Sthanikam

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

Article Image

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్వప్న (34) అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.యువ న్యాయవాది హత్యతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, న్యాయవాదుల రక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News