యూరియా ఆన్లైన్ బుకింగ్ రద్దు చేయాలి: ఆవుల నాగరాజు యాదవ్
యూరియా ఆన్లైన్ బుకింగ్ రద్దు చేయాలి: ఆవుల నాగరాజు యాదవ్
Komidala Mahender reddy
రాష్ట్రంలో అమలవుతున్న యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత విధానంలోనే రైతులకు ఎరువులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుండ్రంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ ఆవుల నాగరాజు యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఆన్లైన్ బుకింగ్ విధానం పై గ్రామీణ ప్రాంతాల రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో వారు తీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేని రైతులు ఇతరుల సహాయంపై ఆధారపడాల్సివస్తోందన్నారుయూరియా నిల్వ ఉన్న డీలర్లు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమేఆన్లైన్బుకింగ్కుఅవకాశంకల్పిస్తున్నారని, అయితే కేవలం పది నిమిషాల్లోనే స్టాక్ అయిపోయిందని ప్రకటించడం రైతులనుఆశ్చర్యానికిగురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందనే అనుమానాలువ్యక్తమవుతున్నాయని తెలిపారు.సకాలంలో యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని, సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రైతు సంక్షేమం దృష్ట్యా ఆన్లైన్ విధానాన్నిపునఃసమీక్షించి, పాత విధానంలో సరఫరా పునరుద్ధరించాలని ఆవుల నాగరాజు యాదవ్ కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి