యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు
యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్:
తిరువూరు :పేదల పెన్నిది, యుగపురుషుడు ఎన్టీఆర్కు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ మరియు కూటమి నేతలు.
తెదేపా నేతలు మాట్లాడుతూ..తెలుగువారి ఆత్మగౌరవాన్నిఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేశారు.
రూ.2 కే కిలో బియ్యం, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో పేద ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు..
చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వివిధ హోదాలో తెదేపా నాయకులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి