ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి
ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి
Editor Desk
అవగాహన ర్యాలీతో ప్రజల్లో చైతన్యం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి ఉన్న భాద్యతను గుర్తుచేస్తూ రామన్నపేట మండలంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేష స్పందన తెచ్చుకుంది. డీఆర్డీఏ సురేష్, ఏడిఆర్డిఓ జంగారెడ్డి, తహసీల్దార్ లాల్ బహదూర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, మానవహారం, ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవిధమైన ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించాలి. గ్రామాభివృద్ధి దిశగా మంచి ఆలోచనలు కలిగిన వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు.
ప్రతి ఓటరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని, “ఓటును అమ్ముకోవద్దు… గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే వారినే ఎన్నుకోండి” అని అధికారులు సూచించారు.
కార్యక్రమంలో సీఐ ఎన్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాములు, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి