Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి
February 12, 2026 06:40 AM 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

తహసీల్దారుకు వినతి పత్రం

రైతులకు యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యూరియాను యాప్ విధానంలో అందించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు లేని రైతులు, సెల్ ఫోన్ లేని రైతులు కొత్త విధానంతో యూరియాను పొందలేకపోతున్నారని అన్నారు.ఎరువు దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవాలని చెప్పి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. కొందరు దుకాణ యజమానులు రైతుల పేర్లతోనే నమోదు చేసుకుని ఎరువును బ్లాకులో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. మండలానికి కేటాయించిన యూరియా ఇతర మండలాలకు మళ్లుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.అందువల్ల యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా రైతులకు సరిపడా అందించాలని, ఏ మండలానికి వచ్చిన యూరియాను ఆ మండల రైతులకే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయాలని, రైతుల రుణాలను తక్షణమే మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకుడు కలకొండ సురేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, నాయకులు బత్తుల ఉప్పయ్య, నోముల రంగారావు, నిమ్మల వెంకన్న, కలకొండ కల్పన తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News