Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి
February 12, 2026 06:40 AM 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

తహసీల్దారుకు వినతి పత్రం

రైతులకు యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యూరియాను యాప్ విధానంలో అందించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు లేని రైతులు, సెల్ ఫోన్ లేని రైతులు కొత్త విధానంతో యూరియాను పొందలేకపోతున్నారని అన్నారు.ఎరువు దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవాలని చెప్పి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. కొందరు దుకాణ యజమానులు రైతుల పేర్లతోనే నమోదు చేసుకుని ఎరువును బ్లాకులో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. మండలానికి కేటాయించిన యూరియా ఇతర మండలాలకు మళ్లుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.అందువల్ల యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా రైతులకు సరిపడా అందించాలని, ఏ మండలానికి వచ్చిన యూరియాను ఆ మండల రైతులకే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయాలని, రైతుల రుణాలను తక్షణమే మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకుడు కలకొండ సురేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, నాయకులు బత్తుల ఉప్పయ్య, నోముల రంగారావు, నిమ్మల వెంకన్న, కలకొండ కల్పన తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News