Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్

యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్

యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్
31-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విస్సన్నపేట జనవరి 31ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో సిపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వం పెంపొందించేందుకు అంటూ యుజిసి తెచ్చిన విధివిధానాలు ఆస్పష్టంగా ఉన్నాయని కుల వివక్షతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.కుల వివక్షత లేని సమాజం కోసం మనం ఏమి సాధించాము మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళుతున్నామా అనే భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందని హరినాథ్ తెలిపారు. హాస్టల్లో అందరూ కలిసి ఉండే సంస్కృతి మంచిదన్నారు. విద్యాసంస్థల్లో స్వేచ్ఛ సమానత్వ వాతావరణాన్ని నెలకొల్పాలని హరినాథ్ కోరారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలోను సమానత్వ (ఈక్విటీ)కమిటీల ఏర్పాటును యూజీసీ తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓ బి సి, ఎస్ సి ,ఎస్ టి దివ్యాంగుల మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహ నిబంధనలు-2012 స్థానంలో యూ జీసీ కొత్త నిబంధనలను ఈనెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. వీటిలో కుల వివక్ష నిర్వచనాన్ని ఓ బి సి ఎస్ సి ,ఎస్ టి, విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని హరినాథ్ అన్నారు. కుల వివక్షతకు తావు ఇవ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలాయూజీసీ ఆదేశాల్లో మార్పు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్త నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హరినాథ్ హెచ్చరించారు.

Sthanikam

యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్

Article Image

విస్సన్నపేట జనవరి 31ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో సిపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వం పెంపొందించేందుకు అంటూ యుజిసి తెచ్చిన విధివిధానాలు ఆస్పష్టంగా ఉన్నాయని కుల వివక్షతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.కుల వివక్షత లేని సమాజం కోసం మనం ఏమి సాధించాము మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళుతున్నామా అనే భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందని హరినాథ్ తెలిపారు. హాస్టల్లో అందరూ కలిసి ఉండే సంస్కృతి మంచిదన్నారు. విద్యాసంస్థల్లో స్వేచ్ఛ సమానత్వ వాతావరణాన్ని నెలకొల్పాలని హరినాథ్ కోరారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలోను సమానత్వ (ఈక్విటీ)కమిటీల ఏర్పాటును యూజీసీ తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓ బి సి, ఎస్ సి ,ఎస్ టి దివ్యాంగుల మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహ నిబంధనలు-2012 స్థానంలో యూ జీసీ కొత్త నిబంధనలను ఈనెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. వీటిలో కుల వివక్ష నిర్వచనాన్ని ఓ బి సి ఎస్ సి ,ఎస్ టి, విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని హరినాథ్ అన్నారు. కుల వివక్షతకు తావు ఇవ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలాయూజీసీ ఆదేశాల్లో మార్పు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్త నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హరినాథ్ హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News