యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్
యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్
GADDAM JAGANMOHAN REDDY
విస్సన్నపేట జనవరి 31ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో సిపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వం పెంపొందించేందుకు అంటూ యుజిసి తెచ్చిన విధివిధానాలు ఆస్పష్టంగా ఉన్నాయని కుల వివక్షతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.కుల వివక్షత లేని సమాజం కోసం మనం ఏమి సాధించాము మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళుతున్నామా అనే భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందని హరినాథ్ తెలిపారు. హాస్టల్లో అందరూ కలిసి ఉండే సంస్కృతి మంచిదన్నారు. విద్యాసంస్థల్లో స్వేచ్ఛ సమానత్వ వాతావరణాన్ని నెలకొల్పాలని హరినాథ్ కోరారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలోను సమానత్వ (ఈక్విటీ)కమిటీల ఏర్పాటును యూజీసీ తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓ బి సి, ఎస్ సి ,ఎస్ టి దివ్యాంగుల మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహ నిబంధనలు-2012 స్థానంలో యూ జీసీ కొత్త నిబంధనలను ఈనెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. వీటిలో కుల వివక్ష నిర్వచనాన్ని ఓ బి సి ఎస్ సి ,ఎస్ టి, విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని హరినాథ్ అన్నారు. కుల వివక్షతకు తావు ఇవ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలాయూజీసీ ఆదేశాల్లో మార్పు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్త నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హరినాథ్ హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి