యాత్ర బస్సును ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
యాత్ర బస్సును ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
Editor Desk
కర్నూలు: జిల్లా పంచలింగాల టోల్గేట్ వద్ద నిర్వహించిన బ్లాక్ స్పాట్స్ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించి, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, హైవే అధికారులకు సూచనలు చేశారు. రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.
ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ నియంత్రణ చర్యలు, సరైన లైటింగ్, రహదారి గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి