Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Lecture on AI Tools for Report Preparation Held at GDC Hayathnagar స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 06:32 PM

యాత్ర బస్సును ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

యాత్ర బస్సును ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

యాత్ర బస్సును ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
May 16, 2026 05:30 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: జిల్లా పంచలింగాల టోల్‌గేట్ వద్ద నిర్వహించిన బ్లాక్ స్పాట్స్ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించి, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, హైవే అధికారులకు సూచనలు చేశారు. రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.

ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ నియంత్రణ చర్యలు, సరైన లైటింగ్, రహదారి గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News