Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:36 PM

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్
December 28, 2025 07:14 PM 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

యూరియా కొనుగోలుకు ఇకపై ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్ తెలిపారు. ఈ నెల 29 నుంచి యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా మొబైల్ ఆప్ ద్వారా బుక్ చేసుకుని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

డీలర్లు సోమవారం నుంచి కేవలం ఆప్‌లో బుక్ చేసుకున్న రైతులకే యూరియాను విక్రయించాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతులు తమ ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ ఆప్ను డౌన్‌లోడ్ చేసుకుని యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు.

రైతుల భూమి పరిమాణం, సాగు చేసిన పంట వివరాల ఆధారంగా ఆప్ ద్వారా యూరియా కేటాయింపు జరుగుతుందని తెలిపారు. యూరియా కొనుగోలు సమయంలో ఆప్‌లో బుకింగ్ చేసిన తర్వాత వచ్చే బుకింగ్ ఐడి తో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు.

రైతులకు ఆప్ వినియోగంలో సాంకేతిక సహాయం అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, సహకార సంఘాల అధికారులు, డీలర్లు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా ఆప్‌ను వినియోగించుకుని సహకరించాలని కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News