Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్
December 28, 2025 07:14 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

యూరియా కొనుగోలుకు ఇకపై ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్ తెలిపారు. ఈ నెల 29 నుంచి యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా మొబైల్ ఆప్ ద్వారా బుక్ చేసుకుని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

డీలర్లు సోమవారం నుంచి కేవలం ఆప్‌లో బుక్ చేసుకున్న రైతులకే యూరియాను విక్రయించాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతులు తమ ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ ఆప్ను డౌన్‌లోడ్ చేసుకుని యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు.

రైతుల భూమి పరిమాణం, సాగు చేసిన పంట వివరాల ఆధారంగా ఆప్ ద్వారా యూరియా కేటాయింపు జరుగుతుందని తెలిపారు. యూరియా కొనుగోలు సమయంలో ఆప్‌లో బుకింగ్ చేసిన తర్వాత వచ్చే బుకింగ్ ఐడి తో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు.

రైతులకు ఆప్ వినియోగంలో సాంకేతిక సహాయం అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, సహకార సంఘాల అధికారులు, డీలర్లు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా ఆప్‌ను వినియోగించుకుని సహకరించాలని కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News