యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Editor Desk
యడవల్లి రాంరెడ్డి కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శ
ఖమ్మం:స్థానికం ప్రతినిధి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యడవల్లి రాంరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు.
రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యడవల్లి రాంరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి