స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ,కాంచీపురం మాజీ ఎంపీ.విష్వనాథన్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బీర్ల అయిలయ్య ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.స్వామివారి ఆశీస్సులతో...రాష్ట్ర ప్రజలకు శాంతి,సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.అనంతరం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వగృహంలో విష్వనాథన్ ను కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి