Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:45 AM

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య
January 20, 2026 02:07 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం,మోటకొండూరు, ఆలేరు పట్టణాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం యాదగిరిగుట్టకు విచ్చేశారు.

ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి, విప్‌కు స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.భక్తుల శ్రేయస్సు,రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News