Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య
January 20, 2026 02:07 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం,మోటకొండూరు, ఆలేరు పట్టణాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం యాదగిరిగుట్టకు విచ్చేశారు.

ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి, విప్‌కు స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.భక్తుల శ్రేయస్సు,రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News