యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి,విప్ బీర్ల అయిలయ్య
Sthanikam District Staff Reporter
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం,మోటకొండూరు, ఆలేరు పట్టణాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం యాదగిరిగుట్టకు విచ్చేశారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి, విప్కు స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.భక్తుల శ్రేయస్సు,రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి