Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:35 AM

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు
February 10, 2026 05:52 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, యాదాద్రి బార్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధ చట్టాలు, వాటి చెడు ప్రభావాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిషేధ చట్టం కఠినంగా అమలవుతుందని, ప్రతి నేరం తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారని తెలిపారు.

జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి విష్ణుమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, ఈ చట్టం కింద నేరం రుజువైతే బెయిల్ కూడా కష్టమేనని హెచ్చరించారు.కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News