Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:49 PM

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు
February 10, 2026 05:52 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, యాదాద్రి బార్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధ చట్టాలు, వాటి చెడు ప్రభావాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిషేధ చట్టం కఠినంగా అమలవుతుందని, ప్రతి నేరం తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారని తెలిపారు.

జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి విష్ణుమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, ఈ చట్టం కింద నేరం రుజువైతే బెయిల్ కూడా కష్టమేనని హెచ్చరించారు.కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News