Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:24 AM

యాదగిరిగుట్ట పాతగుట్ట బ్రహ్మోత్సవాలు భక్తి విశ్వాసాలకు ప్రతీక:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట పాతగుట్ట బ్రహ్మోత్సవాలు భక్తి విశ్వాసాలకు ప్రతీక:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట పాతగుట్ట బ్రహ్మోత్సవాలు భక్తి విశ్వాసాలకు ప్రతీక:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
January 25, 2026 02:21 AM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాతగుట్ట దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవ ఆహ్వాన మహోత్సవం–2026కు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు భక్తి భావాలతో ఘనంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ పండితులు, వేద పండితులు బీర్ల ఐలయ్యకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేస్తూ, ప్రజాసేవలోను రాజకీయ జీవితంలోను మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,భగవంతుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన మహోత్సవమని అన్నారు. ఈ పర్వదినాల్లో లక్షలాది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News