Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
February 20, 2026 07:48 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట:ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఆసుపత్రిలో డాక్టర్,మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ పరిశీలించారు.సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈరోజు ఓ.పి కి ఎంత మంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్య తో వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషంట్లలో ఎక్కువగా ఏ సమస్య పై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరైన మందులు అన్ని సరిపోను అందుబాటులో ఉన్నాయ అని అడిగి,అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గత నెలలో ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరిగాయని, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని అయ్యాయని ఆరా తీశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారని గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.ఆసుపత్రిలో ఇటీవల నార్మల్ డెలివరీ జరిగిన గర్భిణి స్త్రీ కి కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది,ఎంత బరువు లో పుట్టారు,ఆసుపత్రి లో డాక్టర్ మరియు సిబ్బంది వైద్య చికిత్సలు అన్ని మంచిగా చేసారా అని అడిగి తెలుసుకున్నారు.అప్పుడు గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి లో మంచి వైద్య సేవలు అందిస్తున్నారని,ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News