Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:33 AM

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
20-02-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట:ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఆసుపత్రిలో డాక్టర్,మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ పరిశీలించారు.సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈరోజు ఓ.పి కి ఎంత మంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్య తో వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషంట్లలో ఎక్కువగా ఏ సమస్య పై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరైన మందులు అన్ని సరిపోను అందుబాటులో ఉన్నాయ అని అడిగి,అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గత నెలలో ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరిగాయని, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని అయ్యాయని ఆరా తీశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారని గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.ఆసుపత్రిలో ఇటీవల నార్మల్ డెలివరీ జరిగిన గర్భిణి స్త్రీ కి కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది,ఎంత బరువు లో పుట్టారు,ఆసుపత్రి లో డాక్టర్ మరియు సిబ్బంది వైద్య చికిత్సలు అన్ని మంచిగా చేసారా అని అడిగి తెలుసుకున్నారు.అప్పుడు గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి లో మంచి వైద్య సేవలు అందిస్తున్నారని,ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Article Image

యాదగిరిగుట్ట:ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఆసుపత్రిలో డాక్టర్,మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ పరిశీలించారు.సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈరోజు ఓ.పి కి ఎంత మంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్య తో వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషంట్లలో ఎక్కువగా ఏ సమస్య పై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరైన మందులు అన్ని సరిపోను అందుబాటులో ఉన్నాయ అని అడిగి,అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గత నెలలో ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరిగాయని, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని అయ్యాయని ఆరా తీశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారని గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.ఆసుపత్రిలో ఇటీవల నార్మల్ డెలివరీ జరిగిన గర్భిణి స్త్రీ కి కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది,ఎంత బరువు లో పుట్టారు,ఆసుపత్రి లో డాక్టర్ మరియు సిబ్బంది వైద్య చికిత్సలు అన్ని మంచిగా చేసారా అని అడిగి తెలుసుకున్నారు.అప్పుడు గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి లో మంచి వైద్య సేవలు అందిస్తున్నారని,ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News