Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:32 AM

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం–దూడ మృతి

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం–దూడ మృతి

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం–దూడ మృతి
25-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సంఘటన స్థలాన్ని పరిశీలించిన- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల అయిలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాప్ కెమెరాల సహాయంతో,డ్రోన్ కెమెరాల సహాయం తో,ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి గుర్తించాలని తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని,పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు.చీకటి పడే లోపు గ్రామంలోకి రైతులు చేరుకోవాలన్నారు.పులి సంచారం నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..

Sthanikam

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం–దూడ మృతి

Article Image

సంఘటన స్థలాన్ని పరిశీలించిన- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల అయిలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాప్ కెమెరాల సహాయంతో,డ్రోన్ కెమెరాల సహాయం తో,ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి గుర్తించాలని తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని,పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు.చీకటి పడే లోపు గ్రామంలోకి రైతులు చేరుకోవాలన్నారు.పులి సంచారం నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News