యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు
యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు
Editor Desk
: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు, జోడు సేవలు, కొండకింద సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొండపై ఉన్న అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.29,97,382 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమాల్లో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, రాకేష్కుమార్ చార్యులు, మురళీకుమార్ చార్యులు, శ్రీనాథ్ చార్యులు, ఇన్చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది రాజాగౌడ్, మధు, యాదగిరి, దేవస్థాన సిబ్బంది కొమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి