Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 10:16 PM

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు
May 14, 2026 09:03 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు, జోడు సేవలు, కొండకింద సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపై ఉన్న అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.29,97,382 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమాల్లో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, రాకేష్‌కుమార్ చార్యులు, మురళీకుమార్ చార్యులు, శ్రీనాథ్ చార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది రాజాగౌడ్, మధు, యాదగిరి, దేవస్థాన సిబ్బంది కొమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News