Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:09 AM

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు
14-05-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు, జోడు సేవలు, కొండకింద సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపై ఉన్న అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.29,97,382 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమాల్లో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, రాకేష్‌కుమార్ చార్యులు, మురళీకుమార్ చార్యులు, శ్రీనాథ్ చార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది రాజాగౌడ్, మధు, యాదగిరి, దేవస్థాన సిబ్బంది కొమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

Article Image

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు, జోడు సేవలు, కొండకింద సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపై ఉన్న అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.29,97,382 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమాల్లో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, రాకేష్‌కుమార్ చార్యులు, మురళీకుమార్ చార్యులు, శ్రీనాథ్ చార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది రాజాగౌడ్, మధు, యాదగిరి, దేవస్థాన సిబ్బంది కొమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News