Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు
March 16, 2026 08:18 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట,యాదాద్రి కొండపై ఉన్న అనుబంధ దేవాలయం శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం,రుద్రహోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పార్వతీ దేవిని కొలుస్తూ ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.ఉదయం నుంచి శివునికి అభిషేక పూజలు నిర్వహించి,వివిధ రకాల పూలతో,బిల్వ పత్రాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారతులు సమర్పించి స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News