యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంత రావు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంత రావు.
Sthanikam District Staff Reporter
మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పలు సమస్యలపై ప్రజల నుండి వినతులు వచ్చాయి.
వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించిన కలెక్టర్..
యాదగిరిగుట్ట:మండలం కాచారం గ్రామంకు చెందిన ఏలూరి పద్మ తన భర్త చనిపోయి 7 సంవత్సరాలు గడిచిన తనకు వితంతు పెన్షన్ రావడంలేదని, భర్తకు వికలాంగుల పెన్షన్ వచ్చేది అని,అది రద్దుచేసి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని ఫిర్యాదు చేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు.
ఆలేరు:రఘునాథపురంలోని ప్రాథమిక విద్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు,వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న నాణ్యమైన విద్య,ఉత్తీర్ణత శాతం,మౌలిక వసతులు వంటివి తల్లిదండ్రులకి అవగాహన కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విధంగా అవగాహన కల్పించామని తదనుగుణంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సరిపోను కావలసిన మౌలిక వసతులను కల్పించాలని తెలియజేయగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఈ ఈ పంచాయతీ రాజ్ ను తక్షణమే ప్రపోజల్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆత్మకూరు:మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆఫీస్ స పనిచేస్తున్న ఎం.బాల నరసయ్య కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ నుండి రికార్డ్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించాలని అర్జీ ఇవ్వగా కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. పోచంపల్లి:మండలంలోని పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు గత 4 నెలల నుండి 9 నెలల వరకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్న సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఫిర్యాదు చేయగా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి కార్మికుల ఇబ్బందులు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి