Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంత రావు.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంత రావు.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంత రావు.
February 19, 2026 08:36 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పలు సమస్యలపై ప్రజల నుండి వినతులు వచ్చాయి.

వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించిన కలెక్టర్..

యాదగిరిగుట్ట:మండలం కాచారం గ్రామంకు చెందిన ఏలూరి పద్మ తన భర్త చనిపోయి 7 సంవత్సరాలు గడిచిన తనకు వితంతు పెన్షన్ రావడంలేదని, భర్తకు వికలాంగుల పెన్షన్ వచ్చేది అని,అది రద్దుచేసి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని ఫిర్యాదు చేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు.

ఆలేరు:రఘునాథపురంలోని ప్రాథమిక విద్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు,వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న నాణ్యమైన విద్య,ఉత్తీర్ణత శాతం,మౌలిక వసతులు వంటివి తల్లిదండ్రులకి అవగాహన కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విధంగా అవగాహన కల్పించామని తదనుగుణంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సరిపోను కావలసిన మౌలిక వసతులను కల్పించాలని తెలియజేయగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఈ ఈ పంచాయతీ రాజ్ ను తక్షణమే ప్రపోజల్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆత్మకూరు:మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆఫీస్ స పనిచేస్తున్న ఎం.బాల నరసయ్య కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ నుండి రికార్డ్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించాలని అర్జీ ఇవ్వగా కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. పోచంపల్లి:మండలంలోని పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు గత 4 నెలల నుండి 9 నెలల వరకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్న సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఫిర్యాదు చేయగా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి కార్మికుల ఇబ్బందులు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News