యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ విభాగాన్ని విభజించి నూతనంగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాకు తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన ఎస్పీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నూతన పోలీస్ విభాగం ఏర్పాటు ద్వారా యాదాద్రి జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత మరింత బలోపేతం కానుందని అధికారులు అభిప్రాయపడ్డారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి