Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:40 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
December 20, 2025 05:40 PM 167 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

రైల్వే పోలీసుల వివరాల ప్రకారం…

ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితమే వివాహమైంది. సింహాచలం హైదరాబాద్‌లోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా, దంపతులు జగద్గిరిగుట్ట గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు.

విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన అనంతరం కోచ్ డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో ఇద్దరూ అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్ ఘటనను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కొద్ది రోజులకే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతుల ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News