Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:11 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
December 20, 2025 05:40 PM 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

రైల్వే పోలీసుల వివరాల ప్రకారం…

ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితమే వివాహమైంది. సింహాచలం హైదరాబాద్‌లోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా, దంపతులు జగద్గిరిగుట్ట గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు.

విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన అనంతరం కోచ్ డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో ఇద్దరూ అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్ ఘటనను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కొద్ది రోజులకే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతుల ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News