Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:15 PM

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం
January 21, 2026 07:54 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ముగ్గురు నిందితుల అరెస్టు

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కేసారం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె మెడలో ఉన్న ఒక తులం బంగారు గొలుసును దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై బాధితురాలి చిన్న కుమారుడు మెత్తబోయిన చిన్న మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ జి. రాజశేఖర్, ఎస్సై ఎన్. బాలు నాయక్, వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టి, సూర్యాపేట మండలం రామ్ల తండాకు చెందిన వాంకుడోత్ పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News