Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:52 AM

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం
January 21, 2026 07:54 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

ముగ్గురు నిందితుల అరెస్టు

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కేసారం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె మెడలో ఉన్న ఒక తులం బంగారు గొలుసును దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై బాధితురాలి చిన్న కుమారుడు మెత్తబోయిన చిన్న మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ జి. రాజశేఖర్, ఎస్సై ఎన్. బాలు నాయక్, వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టి, సూర్యాపేట మండలం రామ్ల తండాకు చెందిన వాంకుడోత్ పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News