వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం
వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం
Vikram
ముగ్గురు నిందితుల అరెస్టు
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కేసారం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె మెడలో ఉన్న ఒక తులం బంగారు గొలుసును దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై బాధితురాలి చిన్న కుమారుడు మెత్తబోయిన చిన్న మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ జి. రాజశేఖర్, ఎస్సై ఎన్. బాలు నాయక్, వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టి, సూర్యాపేట మండలం రామ్ల తండాకు చెందిన వాంకుడోత్ పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి