Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం

వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం
January 21, 2026 07:54 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ముగ్గురు నిందితుల అరెస్టు

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కేసారం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె మెడలో ఉన్న ఒక తులం బంగారు గొలుసును దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై బాధితురాలి చిన్న కుమారుడు మెత్తబోయిన చిన్న మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ జి. రాజశేఖర్, ఎస్సై ఎన్. బాలు నాయక్, వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టి, సూర్యాపేట మండలం రామ్ల తండాకు చెందిన వాంకుడోత్ పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News